News October 31, 2025
మంచిర్యాల: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్

మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన జాతీయ కళాకార్ సంఘ్ సమావేశంలో ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్పగించి నియామక పత్రం అందజేశారు. చిత్రకారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News November 1, 2025
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

TG: ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. ₹100 ఫైన్తో ఈ నెల 16-24, ₹500తో ఈ నెల 26 నుంచి DEC 1 వరకు, ₹2వేల జరిమానాతో DEC 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ENG ప్రాక్టికల్స్కు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ కు ₹630, ఫస్టియర్ ఒకేషనల్కి ₹870, సెకండియర్ ఆర్ట్స్కు ₹630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్కి ₹870 చెల్లించాలి.
News November 1, 2025
సంసార చక్రం నుంచి విముక్తి పొందాలంటే..

మన జీవుడికి 3 రకాల శరీరాలు ఉంటాయి. అవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరంలోనే(భౌతిక దేహం) అన్ని కర్మలు చేస్తాం. సూక్ష్మశరీరం(మనస్సు, ఇంద్రియాలు) సుఖదుఃఖాలను అనుభవిస్తుంది. కారణశరీరం(అజ్ఞాన రూపం) ఆత్మానందాన్ని పొందుతుంది. మనం చేసే పుణ్యపాప కర్మల ఫలంగా సుఖదుఃఖాలు కలుగుతాయి. జీవుడిలా కర్మల బంధంలో, సంసార చక్రంలో తిరుగుతాడు. వీటి నుంచి విముక్తి పొందడానికి శివుడిని ప్రార్థించడమే మార్గం.<<-se>>#SIVOHAM<<>>
News November 1, 2025
వెనిజులాపై దాడులు చేస్తారా? ట్రంప్ ఏమన్నారంటే

వెనిజులాలో కొకైన్ ఫెసిలిటీస్, డ్రగ్ ట్రాఫికింగ్ రూట్లపై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వచ్చిన <<18162638>>వార్తలను<<>> ప్రెసిడెంట్ ట్రంప్ ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కరీబియన్, ఈస్టర్న్ పసిఫిక్లో గత నెల నుంచి ఇప్పటివరకు 15 అనుమానిత డ్రగ్ స్మగ్లింగ్ బోట్లపై యూఎస్ దాడులు జరిపింది. ఈ ఆపరేషన్లలో ఇప్పటివరకు 61 మంది మరణించారు. కాగా పడవలపై దాడుల్ని ఆపేయాలని USను UN కోరింది.


