News October 31, 2025
కాసిపేట: అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

కాసిపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలన్నారు.
Similar News
News November 1, 2025
ఖమ్మం: ‘కాపలా కాసి చంపేశారు’

సీపీఎం నేత సామినేని రామారావు <<18156229>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. రోజులాగే గ్రామంలో వాకింగ్కు వెళ్లి ఉ.6:15కు వచ్చారు. ఇంటి ఆవరణలోని కొట్టంలో కోళ్లు వదులుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో ఛాతి, పొట్టలో 8సార్లు పొడిచారు. కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిపౌచ్, ఓ జత చెప్పులు, టీషర్ట్ లభించాయి. విచారణకు సీపీ 5బృందాలు ఏర్పాటు చేశారు.
News November 1, 2025
NZB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నేపథ్యమిదే!

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన బోధన్ MLA సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలంలో 1949లో జన్మించారు. 1989లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో బోధన్ నుంచి గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టారు. 7 పర్యాయాలు పోటీ చేసిన ఆయన 4 సార్లు MLAగా గెలిచారు. YSR హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.
News November 1, 2025
కామారెడ్డి: కన్నీటి ‘మొంథా’.. రోడ్డుపైనే రైతన్న నిద్ర

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైవే వెంబడి సర్వీస్ రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్ల లేక రెండు రోజులుగా రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ, రాత్రివేళ అక్కడే నిద్రపోతున్నారు. పిట్లంలోని హైవే సర్వీస్ రోడ్డుపై ఓ రైతు రాత్రి చలికి పడుకున్న దృశ్యమిది.


