News April 10, 2024

MBNR: ఈనెల 15 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం

image

ఈనెల 15 నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు  సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 4,187 పాఠశాలల్లో 1-9 వరకు చదువుతున్న 4,81,554 నుంచి విద్యార్థులు ఎస్ఏ-2 పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు డీఈవోల ఆధ్వర్యంలో సంబందిత జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ద్వారా ప్రశ్నపత్రాలు సరఫరా చేశారు.

Similar News

News March 1, 2026

మహబూబ్ నగర్: జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు

image

శాంతిభద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News February 28, 2026

MBNR: అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం

image

మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు సన్నిధిలో ఆదివారం నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణంతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ తెలిపారు. రేపు ధ్వజారోహణం, గరుడ వాహనసేవ, మంగళవారం విమాన రథోత్సవం. అయితే, చంద్రగ్రహణం కారణంగా ఈసారి కళ్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గ్రహణం రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఆలయ ద్వారబంధనం ఉంటుందన్నారు.

News February 28, 2026

MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.