News October 31, 2025
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

AP: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 29న జరగాల్సి ఉండగా.. తుఫానుతో వాయిదా పడిందన్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో 41 వేల ఇళ్లను మంజూరు చేశామని, రూరల్ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది.
Similar News
News November 1, 2025
258 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. వెబ్సైట్: https://www.mha.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 1, 2025
నవంబరులో మామిడి తోటల పెంపకంలో జాగ్రత్తలు

అక్టోబరు ఆఖరు నుంచే మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుంది. పూత సరిగా రాని మామిడి చెట్లలో, పూత రావడానికి ఎథ్రిల్ అనే హార్మోను మందును సిఫారసు చేస్తారు. ఈ హార్మోనును నవంబరు నెల నుంచి డిసెంబర్ వరకు 2 వారాలకు ఒకసారి చొప్పున 4 సార్లు లీటరు నీటికి 2ml చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూత సరిగా రాని చెట్లలో ఇది మంచి ఫలితాలనిస్తుంది.
News November 1, 2025
యూరియాకు గుళికలు కలిపి వాడుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.


