News October 31, 2025
చిత్తూరులో ఐదుగురికి ఉరిశిక్ష.. రేరెస్ట్ ఆఫ్ ది రేర్

చిత్తూరులో అనురాధ దంపతుల <<18160618>>హత్య <<>>కేసు ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్’ అంటూ కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష వేసింది. ఒకే కేసులో ఐదుగురికి ఉరిశిక్ష వేయడం దేశంలోనే అరుదైన విషయం. గోద్రా రైలు దహన ఘటన కేసులో ట్రయల్ కోర్టు 11 మందికి ఉరి శిక్ష విధించినా.. ఆ తర్వాత యావజ్జీవ శిక్షగా మారింది. ఛత్తీస్గఢ్లో గిరిజన బాలికపై అత్యాచారం, ఇద్దరి హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడినా.. అప్పీల్కు వెళ్లడంతో ఇప్పటికీ పెండింగ్లో ఉంది.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది వరకు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమాచారం కొరకు 08942 240557 కంట్రోల్ రూం నంబర్ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.
News November 1, 2025
డోన్ వద్ద బోల్తా పడ్డ MPDO వాహనం

పింఛన్ల పంపిణీ విధులను ముగించుకుని డోన్ వైపు వస్తుండగా చింతలపేట సమీపంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ నారాయణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో, ఏఈ నారాయణ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
News November 1, 2025
GWL: విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.!

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్ జయరాములును తక్షణమే <<18166938>>సస్పెండ్<<>> చేయాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


