News November 1, 2025
HYD: ప్రముఖులను అందించిన నిజాం కాలేజీ

HYD బషీర్బాగ్లోని నిజాం కాలేజీకి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలోనే మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, KTR, నాదెండ్ల మనోహర్, ప్రొ.కోదండరాం, అసదుద్దీన్ ఒవైసీ, బాలకృష్ణ, అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ, IPS అధికారులు CVఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ప్రముఖులు చదివారు. శుక్రవారం TG మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ కూడా నిజాం కాలేజీ పూర్వ విద్యార్థే.
Similar News
News November 2, 2025
HYDలో KCR చేసింది ఏం ఉంది: CM రేవంత్ రెడ్డి

HYDలో KCR అభివృద్ధి చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డలో నవీన్ యాదవ్కు మద్దతుగా CM రోడ్ షో నిర్వహించారు. ‘సిటీకి YSR మెట్రో తెచ్చారు. ORR, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కాంగ్రెస్ నిర్మించింది. IT, ఫార్మా కంపెనీలు మేమే తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి HYDలో KCR చేసింది ఏం ఉంది’ అంటూ రేవంత్ నిలదీశారు. దీనిపై మీ కామెంట్?
News November 1, 2025
హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం కలకలం

హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
రేవంత్కు KTR “జూబ్లీహిల్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్” కౌంటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముమ్మరం కావడంతో BRS పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలుపై రేవంత్ రెడ్డి, KTR ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు KTR త్వరలో కౌంటర్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. BRS హయాంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు, ఫ్రీ వాటర్ ఇతర అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వనున్నారు.


