News November 1, 2025
ఆదిలాబాద్: ఓపెన్ ఫలితాలు విడుదల

TOSS ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు DEO ఖుష్బూ గుప్తా, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 22 – 28వరకు జరిగిన పరీక్షల ఫలితాలు https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. మెమోల్లో పొరపాట్లుంటే ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి రీకౌంటింగ్ కోసం పేపర్ కు రూ.350, ఇంటర్కు రూ.400 చెల్లించాలన్నారు.
Similar News
News November 2, 2025
నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.
News November 2, 2025
MBNR: మద్యం లక్కీడిప్.. పీఈటీ సస్పెండ్

అత్యాశకు పోయి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఓ స్కూల్ పీఈటీ (PET) ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాంనగర్లోని బాలికల హైస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప, ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్లో ధర్మాపూర్ వైన్ షాపును దక్కించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి టెండర్లలో పాల్గొనడంపై అధికారులు సీరియస్గా తీసుకున్నారు. విచారణ అనంతరం డీఈఓ ప్రవీణ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేశారు.
News November 2, 2025
NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.


