News November 1, 2025

‘మరో 15 రోజుల్లో సారా రహిత జిల్లాగా కాకినాడ’

image

రాష్ట్రంలో 25 జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మరో 15 రోజుల్లో కాకినాడ జిల్లాను కూడా నాటు సారా రహితంగా మారుస్తామని అధికారులు చెప్పారు. బెల్టు షాపులపై నిఘా మరింత పెంచాలని, రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు ఉండకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు.

Similar News

News November 2, 2025

GWL: ఇసుక క్వారీలపై నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిపారుదల, భూగర్భ జల, గనులు మరియు భూగర్భ శాఖ, టీఎస్‌ఎండీసీ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు ఈ నివేదికలను సిద్ధం చేసి, ఆయా శాఖల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.

News November 2, 2025

ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

image

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.

News November 2, 2025

గోరంట్ల బ్రిడ్జిపై తేలిన ఇనుప కడ్డీలు

image

గోరంట్ల సమీపంలోని బ్రిడ్జిపై ఇనుప కడ్డీలు తేలడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ప్రారంభించిన రెండు మూడేళ్లకే ఇనుప కడ్డీలు తేలడంతో సంబంధిత గుత్తేదారు పనులు నాసిరకంగా చేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రి సవిత దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. తాత్కాలికంగా అపాయకరంగా మారిన ఇనుప కడ్డీలను తొలగించడమో, వాటిపై కాంక్రీట్ వేయడమో చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.