News April 10, 2024
ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన కాచిగూడలో జరిగింది. పోలీసుల ప్రకారం.. NZBకి చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈనెల 8న కాచిగూడ, సుందరనగర్లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అతడి కుమార్తె గౌరీ(13) సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.
Similar News
News March 3, 2026
భారతీయుల కోసం 24/7 హెల్ప్ లైన్ సేవలు!

యూఏఈలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, న్యాయ సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో కన్వీనర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ఈ సేవలను ప్రశంసిస్తూ, యూఏఈలోని భారతీయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరితగతిన సాయం అందించడమే ఈ ఫోరం లక్ష్యమని పేర్కొన్నారు.
News March 3, 2026
NZB: రూ.3.90 లక్షల జరిమానా

నిజామాబాద్లో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ సోమవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 39 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.90 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
News March 2, 2026
NZB: హోలీ పండుగకు పటిష్ట భద్రత ఏర్పాట్లు: సీపీ

హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పేర్కొన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలన్నారు.


