News April 10, 2024
ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది
ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన కాచిగూడలో జరిగింది. పోలీసుల ప్రకారం.. NZBకి చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈనెల 8న కాచిగూడ, సుందరనగర్లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అతడి కుమార్తె గౌరీ(13) సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.
Similar News
News September 30, 2024
NZB: మంత్రి జూపల్లి రాక
మంత్రి జూపల్లి ఇవాళ జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు మోర్తాడ్, 11 గంటలకు భీంగల్, ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ భవనాలను ప్రారంభిస్తారని అధికారులు, నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్లోని IDOC సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
News September 29, 2024
NZB: చెత్తకాగితాలు పోగు చేసుకునే వ్యక్తి హత్య
నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో హత్య జరిగింది. 3వ టౌన్ ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. నవీపేట్కు చెందిన గణేశ్ (30) హత్యకు గురైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శనివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లగా చెత్త సేకరించుకొని బ్రతికే వ్యక్తిగా గుర్తించారు. గుర్తుతెలియని వారు మెడకి తాడు బిగించి హత్య చేసినట్లు గుర్తించమన్నారు. కేసు నమోదైంది.
News September 29, 2024
శ్రీ నరేంద్రాచార్య మహరాజ్ను దర్శించుకున్న ప్రముఖులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి, బంగారపల్లి శివారులో గల తెలంగాణ ఉపపీఠంలో జగద్గురు శ్రీ స్వామి నరేంద్రాచార్య మహరాజ్ను శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వ్యక్తిగత కార్యదర్శి శ్రీ బాలాజీ పాటిల్ ఖత్ గావ్ కర్ దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట నాందేడ్ జిల్లా బీజేపీ నాయకులు వెంకట్రావు, పాటిల్ గోజేగావ్కర్, శివరాజ్ పాటిల్ హోటల్కర్, మాధవ్ రావు ఉన్నారు.