News November 2, 2025

MDK: అడవిలో అందాల విడిది.. నర్సాపూర్ ఎకో పార్క్

image

చుట్టూ దట్టమైన అడవి, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు. నీటిపై తేలియాడే కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్. కనువిందు చేసే ఈ సుందర దృశ్యలు మరెక్కడో కాదండోయ్ మన నర్సాపూర్‌‌లోనే. ఇక్కడి ఫారెస్టులో ఏర్పాటు చేసిన<<18172075>> ఎకో పార్క్‌<<>>ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేసి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఆధునిక హంగులతో ఉన్న ఏర్పాట్లు ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. రాత్రంతా అక్కడే బస చేయవచ్చు.
-SHARE IT

Similar News

News November 3, 2025

బస్సు ప్రమాదంలో చనిపోయింది వీరే

image

TG: <<18184333>>బస్సు ప్రమాదంలో<<>> 19 మంది మరణించగా 15 మందిని అధికారులు గుర్తించారు.
మృతులు: దస్తగిరి బాబా- డ్రైవర్, గుర్రాల అభిత (21)- యాలాల్, మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష- తాండూరు, తారిబాయ్ (45)- దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45)- బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55)- భానూరు, ఏమావత్ తాలీబామ్- ధన్నారం తండా

News November 3, 2025

బాపట్ల కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి కార్యాలయం వద్ద పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 3, 2025

శివయ్య భక్తులకు TGRTC శుభవార్త

image

కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు TGRTC శుభవార్త చెప్పింది. నేరుగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. HYD దిల్‌షుక్‌నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ఈ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.