News April 10, 2024
ఆ సిబ్బందిని వెంటనే బదిలీ చేయండి: భూమిరెడ్డి
జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోం గార్డులును వేరే జిల్లాలకు బదిలీ చేయాలని శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈసీని కోరారు. సీఎం జగన్.. ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పదవులు ఇచ్చారని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. వారు ఎన్నికల పమయంలో అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి లేఖ రాశారు.
Similar News
News October 6, 2024
దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు
దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 6, 2024
కడప నగరంలో కారు బోల్తా
బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.
News October 6, 2024
YVU: సెలవులున్నా.. పరీక్షలు యథాతథం
కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.