News November 2, 2025

HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

image

జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్‌పీఆర్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్‌లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.

Similar News

News November 3, 2025

కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

News November 3, 2025

కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

image

క్రికెట్‌లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్‌<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్‌ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్‌జ్యోత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు అపూర్వ విజయం దక్కింది.

News November 3, 2025

కృష్ణా: డిసెంబర్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిసెంబర్ 18న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి గోపి తెలిపారు. లోక్ అదాలత్ కోసం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కక్షిదారులు రాజీపడే అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ఇరు పార్టీల కక్షిదారులు తమ న్యాయవాదులతో సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.