News November 2, 2025

భీమన్న చెంతకు.. వేములవాడ రాజన్న కోడెలు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెలు శ్రీ భీమేశ్వరాలయానికి తరలి వెళ్తున్న వైనం భక్తులను ఆకట్టుకుంటున్నది. వేములవాడ క్షేత్రంలో ప్రత్యేకమైన కోడెమొక్కు సాంప్రదాయం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. వివాహం కోసం, సంతానం కోసం భక్తులు ఎంతో దూరం నుండి వచ్చి రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాల కారణంగా రాజన్న ఆలయంలో కోడెమొక్కులను నిలిపివేసి భీమేశ్వరాలయంలోకి మార్చారు.

Similar News

News November 4, 2025

జగన్ పర్యటనకు వింత షరతులు: వైసీపీ ఫైర్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గాను జగన్ నేడు జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం రానున్నారు. అయితే జగన్ పర్యటనలో 500 మంది, 10 కాన్వాయ్‌లకే పోలీసులు అనుమతి ఇచ్చారు. బైక్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై YCP ట్వీట్ చేసింది. జగన్ పర్యటనకు వేలాది మంది వస్తారని తెలిసినా ఈ వింత షరతులు ఏంటని మండిపడింది.

News November 4, 2025

కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

image

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.

News November 4, 2025

వీళ్ల పంచాయితీ కొలిక్కి వచ్చేనా?

image

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకానున్నారు. ఉదయం 11గం కొలికిపూడి, మధ్యాహ్నం 4గంటలకు చిన్నీ హాజరవుతారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షతన కమిటీ సభ్యులు నేతల వివరణలు తీసుకోనున్నారు. మరి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం సీఎం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.