News November 2, 2025

VKB: ‘ప్రజావాణిని పట్టించుకోని అధికారులు!

image

ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాల, బొంరాస్‌పేట్‌తో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. సక్రమంగా మండలాలు ప్రజావాణి జరిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తి ఉండదని గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు.

Similar News

News November 3, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు

image

<>మెదక్ <<>>ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 34 జూనియర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మెషినిస్ట్/టర్నర్/గ్రిండర్/ఎలక్ట్రీషియన్/వైండర్/మెకానిక్/ఎలక్ట్రికల్ మెకానిక్/ఫిట్టర్‌లో NAC/NTC ఉండాలి. 18- 30 మధ్య వయసు గల అభ్యర్థులు నవంబర్ 21వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://ddpdoo.gov.in/

News November 3, 2025

నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నేటి నుంచి బంద్ చేపడుతున్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్య సంఘం(FATHI) తెలిపింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కాలేజీలను మూసివేస్తున్నామని వెల్లడించింది. బకాయిలు చెల్లించేవరకు తెరవబోమని హెచ్చరించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 6న HYDలో లక్షన్నర మంది సిబ్బందితో సభ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

News November 3, 2025

అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

image

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.