News November 2, 2025
అచ్చంపేట: బండపై 1000 ఏళ్లనాటి పాదాలు, శివలింగం

అచ్చంపేట పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామ శివారులో ఉన్న శివాలయం ఎదుట ఉన్న బండపై 1000 క్రితం నాటి పాదాలు, శివలింగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివ నాగిరెడ్డి అన్నారు. దేవాలయం కమిటీ అధ్యక్షుడు అంబటి లింగయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం శివాలయం వద్దకు చేరుకొని బండపై చెక్కి ఉన్న వాటిని పరిశీలించారు.
Similar News
News November 3, 2025
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.
News November 3, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 160 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 77, సెంట్రల్ జోన్ పరిధిలో 26, వెస్ట్ జోన్ పరిధిలో 28 ఈస్ట్ జోన్ పరిధిలో 29 కేసులు నమోదు అయ్యాయి.


