News November 2, 2025
డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. హార్టికల్చర్, ఎంటమాలజీ, ఎక్స్టెన్షన్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. PhD, BSc(హానర్స్) హార్టికల్చర్ లేదా BVSc, MSc(అగ్రి./MVSc), MSc/MA, BA/BSc ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్సైట్: https://drysrhu.ap.gov.in/
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంలో చనిపోయింది వీరే

TG: <<18184333>>బస్సు ప్రమాదంలో<<>> 19 మంది మరణించగా 15 మందిని అధికారులు గుర్తించారు.
మృతులు: దస్తగిరి బాబా- డ్రైవర్, గుర్రాల అభిత (21)- యాలాల్, మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష- తాండూరు, తారిబాయ్ (45)- దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45)- బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55)- భానూరు, ఏమావత్ తాలీబామ్- ధన్నారం తండా
News November 3, 2025
శివయ్య భక్తులకు TGRTC శుభవార్త

కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు TGRTC శుభవార్త చెప్పింది. నేరుగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. HYD దిల్షుక్నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ఈ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
News November 3, 2025
కర్నూలు పవర్ ప్రాజెక్టుకు ₹7500 కోట్ల REC ఫండింగ్

AP: బ్రూక్ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC ₹7500 కోట్లు అందించనుంది. ప్రైవేటు ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతిపెద్ద ఫండింగ్ ఇదే. 1.4 GW హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్ఫీల్డ్ ₹9910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 WG పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.


