News November 2, 2025

కదిరిలో 30 మందిపై రౌడీ షీట్లు నమోదు

image

హత్య, హత్యాయత్నం, గంజాయి అమ్మకాలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై కదిరి టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాలతో 30మందిపై రౌడీషీట్లు నమోదు చేసినట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురిపై PD చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు చెప్పారు.

Similar News

News November 3, 2025

PU ‘RTF కోర్సు ఫీజులు విడుదల చేయాలి’

image

PU యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు 4 సంవత్సరాలుగా RTF ఫీజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫీజులు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. స్కాలర్‌షిప్‌లు, కోర్సు ఫీజులు రాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పీయూ అధికారులు స్పందించి వెంటనే ఆర్‌టీఎఫ్‌ ఫీజులను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News November 3, 2025

ఊట్కూర్: సీసీఐ నిబంధనలతో పత్తి రైతులు ఆందోళన

image

సీసీఐ అధికారులు కొత్త నిబంధనలు పెట్టడంతో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో, రెండు రోజుల క్రితం 12 క్వింటాళ్లకు స్లాట్ బుక్ చేసుకున్న రైతులు నిబంధనలు మార్చడంతో ఊట్కూర్‌లోని వినాయక ఇండస్ట్రీస్ ఎదుట పత్తి కొనుగోలు కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ధర్నాను విరమింప చేశారు.

News November 3, 2025

చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.