News November 2, 2025
VJA: జోగి రమేశ్ విచారణ పూర్తి.. కుమారుడికి నోటీసులు జారీ

నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ సిట్ విచారణ పూర్తి అయ్యింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. కాసేపట్లో ప్రభుత్వాస్పత్రికి జోగి రమేశ్ తరలించారు. జోగి రమేశ్ చిన్న కుమారుడు జోగి రోహిత్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని రోహిత్కు సిట్ నోటీసులు జారీ చేశారు.
Similar News
News November 3, 2025
VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యు ఒడికి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.
News November 3, 2025
బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ సోమవారం పొక్సో కోర్టు జడ్జి చినబాబు తీర్పు చెప్పారు. తాడిమర్రి మండలం మరువపల్లికి చెందిన అమర్నాథ రెడ్డిపై 2022లో అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలను కోర్టుకు అందించారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.
News November 3, 2025
కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.


