News November 3, 2025

రాయచోటిలో నేడు స్పందన కార్యక్రమం

image

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం రాయచోటిలో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్‌కి రాకుండా meekosam.ap.gov.inలో కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అర్జీ స్థితి సమాచారం కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అర్జీలుదారులు మాత్రమే కలెక్టరేట్‌కు రావాలని సూచించారు.

Similar News

News November 3, 2025

నాలాలపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు: మేయర్

image

ఆక్రమణలకు గురైన నాలా ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన రిటైనింగ్ వాల్ నిర్మాణాలను చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. HNK పరిధిలోని వరద ముంపునకు గురైన ప్రాంతాలలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్మాణ పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు సూచనలు చేశారు. వరద ముంపునకు గురైన గృహాల వాస్తవ సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని అధికారులకు మేయర్ స్పష్టం చేశారు.

News November 3, 2025

పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2025

మంచిర్యాల: 4న ఉచిత చేప పిల్లల పంపిణీ

image

జిల్లాలోని లక్షట్టిపేట మండలం గుండ్ల కోటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈనెల 4న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ చెప్పారు. జిల్లాలోని 380చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయని,వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35-40మి.మీ చేప పిల్లలు,5 పెరినియల్,6రిజర్వాయర్లలో 108.28 లక్షల చేప పిల్లలను వదలుతామన్నారు.