News November 3, 2025

PDPL: బాయిలర్ పేలిన ఘటనలో గాయపడ్డ కూలీ మృతి

image

బాయిలర్ పేలి గాయపడ్డ రైస్ మిల్ కూలీ మృతి చెందాడు. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ వివరాల ప్రకారం.. గత నెల 29న సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలోని కనకదుర్గ రైస్ మిల్ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో సుల్తానాబాద్ కు చెందిన కూలీ గంగారపు కుమార్ (55) తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 4, 2025

కొండ చుట్టూ గ్రామాలకు వెలుగునిచ్చే గండ దీపం!

image

భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి శివారు బుగులోని వెంకన్న స్వామి జాతరలో గండ దీపం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు వెలుగుతూ ఉంటుంది. మంగళవారం ఈ గండ దీపాన్ని వెలిగించి, 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.ఈ దీపం వెలుగు కొండ చుట్టూ ఉన్న గ్రామాలకు కాంతితో విరజిల్లుతుంది. భక్తులు వెంకన్న స్వామిని స్మరిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడికి చేరుకుంటారు. ఈ దీపంలో నూనె పోసి కోరికలు కోరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

News November 4, 2025

BCలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0: సవిత

image

AP: BCల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్ షాప్‌ను ప్రారంభించారు. ‘BCలు సమిష్టిగా కూటమిని గెలిపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే BCలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాం. వారి కాళ్లపై వారు నిలబడాలని ఆదరణ 3.0 పథకం అమలు చేస్తున్నాం. దానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం’ అని తెలిపారు.

News November 4, 2025

TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

image

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.