News April 10, 2024

తాండూరు: మద్యానికి బానిసైన భర్త.. భార్య ఆత్మహత్య

image

తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన గుమాస భారతి (30) హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారతికి లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణ్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతున్నారు. ఇదే విషయమై భార్యల మధ్య గొడవ జరిగింది. భారతి ఆవేశంతో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

Similar News

News February 1, 2025

ఆదిలాబాద్ అడవుల్లో హైనా సంచారం

image

దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే క్రూర మృగం హైనా ఆదిలాబాద్ జిల్లా మావల అడవుల్లో సంచరించడం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హైనా దృశ్యాలు రికార్డయ్యాయి. మావల హరితాహారం లోని సీసీ కెమెరాల్లో ఈ చిత్రం శుక్రవారం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన హైనాలు తిరిగి మావల అడవుల్లో కనిపించిందన్నారు.

News February 1, 2025

జాతీయస్థాయి పోటీల్లో ADBకు 10 పతకాలు

image

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, వీరేష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జనవరి 27 నుంచి 30వ వరకు పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. జిల్లాకు 2 స్వర్ణ, 3 వెండి, 5 రజత పతకాలు వచ్చాయన్నారు.

News February 1, 2025

శ్యాంపూర్‌లో పర్యటించిన మంత్రి సీతక్క

image

ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో రాష్ట్రమంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. గ్రామంలో కొలువుదీరిన దైవం బుడుందేవ్‌ను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేష్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.