News November 3, 2025
435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.
Similar News
News March 2, 2026
ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.
News March 2, 2026
అగ్నిప్రమాదం సంభవిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

వేసవి సమయం సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. అనంతపురం, శింగనమల, రాప్తాడు: 08554 220299, తాడిపత్రి: 08554 222299, కళ్యాణదుర్గం: 08497-220101, 08497-287101, ఉరవకొండ: 08556-257099, గుంతకల్లు: 08552-226299కు ఫోన్ చేయవచ్చన్నారు.
News March 2, 2026
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


