News November 3, 2025

గద్వాల: ‘మత్స్య సంపద పెంపునకు చర్యలు చేపట్టాలి’

image

రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిల పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మత్స్య సంపద పెంచేందుకు ఆయా జిల్లాలోని జలాశయాలను సిద్ధం చేసి చేప పిల్లలను వదలాలని సూచించారు. ఈ సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.

Similar News

News November 4, 2025

వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయిలో కోడె మొక్కులు

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రికార్డ్ స్థాయిలో భక్తులు కోడె మొక్కులు సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్వామివారి అన్ని రకాల ఆర్జిత సేవలను రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నుంచి భీమేశ్వర స్వామి వారి ఆలయానికి మార్చిన కారణంగా భక్తుల రద్దీ తగ్గుతుందనే అంచనాలకు భిన్నంగా సోమవారం సుమారు 5000 మంది భక్తులు కోడె మొక్కుబడి చెల్లించుకున్నారు.

News November 4, 2025

విజయనగరంలోనూ భూప్రకంపనలు?

image

విశాఖ, అల్లూరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో <<18192060>>భూకంపం<<>> నమోదైనట్ల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. విజయనగరంలోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News November 4, 2025

సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

image

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.