News November 4, 2025

బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం

image

బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం అయింది. జాతరకు వచ్చే భక్తుల రక్షణ కోసం 175 మంది పోలీసు సిబ్బంది, 25 మంది ఎస్సైలు, సీఐలు, ఇతర ఉన్నత అధికారులు డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 50 మంది కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణలో భాగస్వాములు అవుతారు. వ్యర్థాల నిర్వహణకు 6 ట్రాక్టర్లు, రోడ్లపై నీళ్లు చల్లడానికి 6 ట్యాంకర్లు పని చేయనున్నాయి.

Similar News

News November 4, 2025

గోళ్లు విరిగిపోతున్నాయా?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News November 4, 2025

పురుగు మందుల పిచికారీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

☛ పురుగు మందుల పిచికారీకి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్, నాజిల్స్ ఎన్నుకోవాలి. ☛ ద్రావణం తయారీకి మంచినీరే వాడాలి. సిఫార్సు చేసిన మోతాదునే పిచికారీ చేయాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడితే పురుగు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ☛ ఎండ తీవ్రత, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు పిచికారీ చేయరాదు. ☛ జలాశయాలు, చెరువులు, నీరుండే చోటు దగ్గరలో మందు కలపకూడదు.

News November 4, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.