News November 4, 2025

HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

image

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.

Similar News

News November 4, 2025

గోళ్లు విరిగిపోతున్నాయా?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News November 4, 2025

పురుగు మందుల పిచికారీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

☛ పురుగు మందుల పిచికారీకి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్, నాజిల్స్ ఎన్నుకోవాలి. ☛ ద్రావణం తయారీకి మంచినీరే వాడాలి. సిఫార్సు చేసిన మోతాదునే పిచికారీ చేయాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడితే పురుగు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ☛ ఎండ తీవ్రత, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు పిచికారీ చేయరాదు. ☛ జలాశయాలు, చెరువులు, నీరుండే చోటు దగ్గరలో మందు కలపకూడదు.

News November 4, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.