News November 4, 2025

ఏపీ రౌండప్

image

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉందన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
* ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని.. కేంద్ర కార్యాలయానికి లోకేశ్
* రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 1,49,302 హెక్టార్లలో పంట నష్టం!

Similar News

News November 4, 2025

జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్‌కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.

News November 4, 2025

న్యూస్ రౌండప్

image

☛ జూబ్లీహిల్స్ బైపోల్: బీజేపీకి జనసేన మద్దతు
☛ రైతులను కలిసే అర్హత జగన్‌కు లేదు: మంత్రి నిమ్మల
☛ కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. గోవాలో పని చేస్తున్న శిబూ, జనేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
☛ బిహార్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం.. నవంబర్ 6న తొలి విడత పోలింగ్
☛ శ్రీకాకుళం: విద్యార్థుల చేత <<18193619>>కాళ్లు నొక్కించుకున్న<<>> టీచర్ సస్పెండ్
☛ ఎంపీ చిన్నితో ముగిసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ

News November 4, 2025

సిగాచీ బాధితులకు ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు: హైకోర్టు

image

TG: సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన బాధితులకు పరిహారం చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బాధితులకు ఇస్తామన్న ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. మృతుల కుటుంబాలకు ₹25లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా మొత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఏజీ తెలిపారు. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది.