News November 4, 2025

మీర్జాగూడ యాక్సిడెంట్.. VKB జిల్లా వాసులే 15 మంది

image

హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులు అధికులు VKB జిల్లాకు చెందిన వారే. తాండూర్: షేక్ ఖాలీద్ హుస్సేన్, జహాన్, నందిని, సాయిప్రియ, తనూష, వెంకటమ్మ, సెలేహ బేగం, జహీరా ఫాతిమా (పసిపాప), ముస్కాన్ బేగం, యాలాల్: గుర్రాల అఖిలా రెడ్డి, బందెప్ప, లక్ష్మి, దౌల్తాబాద్: హనుమంతు, బషీరాబాద్: దస్తరి బాబా (బస్సు డ్రైవర్) మృతి చెందారు.

Similar News

News November 4, 2025

FLASH: నిర్మల్: యాక్సిడెంట్‌లో డ్రైవర్ మృతి

image

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామ 61 <<18197838>>జాతీయ రహదారిపై మంగళవారం <<>>మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మామడ మండలం కోరటికల్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

News November 4, 2025

తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

image

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News November 4, 2025

భవిత సెంటర్‌లను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

దివ్యాంగ పిల్లల విద్యాప్రమాణాలు మెరుగుపరచేందుకు భవిత సెంటర్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం అన్నారు. నవంబర్ 20 నాటికి మరమ్మతులు, పెయింటింగ్, మౌలిక వసతుల పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచి, యాక్టివిటీలను రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. వినూత్న పద్ధతుల్లో బోధన అందించి, స్పష్టమైన మార్పు కనిపించేలా చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.