News April 10, 2024
మెదక్: ఏడు చెక్ పోస్టుల్లో రూ. 21.27 లక్షలు సీజ్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పోలీసు చెక్ పోస్టుల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 21,27,330 సీజ్ చేసినట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. అలాగే రూ. 17,06,600 విలువగల ఫ్రీ బీస్, రూ.9,75,800 విలువైన 2535.800 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు వివరించారు. వీటిని ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీకి అప్పగించినట్లు వివరించారు.
Similar News
News March 1, 2026
మెదక్: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’

మెదక్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం లాగే రేపు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
News February 28, 2026
మెదక్: ఇన్ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.
News February 28, 2026
మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.


