News November 4, 2025
ములుగు జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు

జిల్లాలో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల్లో 1,318 టార్పాలిన్ కవర్లు, 56 తూర్పార యంత్రాలు, 87 తూకం యంత్రాలతో పాటు 1,28,750 గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటివరకు ఆరుగురు రైతుల నుంచి ₹6,83,254 విలువ గల 28.600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
జూరాలకు 28 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 28 వేల క్యూసెక్కులు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 30,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాలువలకు, భీమా లిఫ్ట్కు కలిపి 2,018 క్యూసెక్కుల నీటిని, మొత్తంగా 33,102 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు.
News November 4, 2025
ఇళ్లకు సమీపంలో చెట్లు ఉండకూడదా?

మర్రి, రావి, వేప వంటి పెద్ద వృక్షాలను ఇళ్లకు అతి సమీపంలో పెంచడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈ చెట్ల వేర్లు బలంగా విస్తరించి ఇంటి పునాదులను దెబ్బ తీసే అవకాశాలుంటాయని అన్నారు. ‘ఇది నిర్మాణానికి హాని కలిగిస్తుంది. వాస్తుపరంగా స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. ఇంటి గోడలకు నష్టం కలగకుండా, గృహ నిర్మాణం ఆయుష్షు పెరగడానికి, ఈ చెట్లను కొంత దూరంలో పెంచడం శుభకరం’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News November 4, 2025
లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎస్సై శివాంజల్తో కలిసి పరిశీలించారు. తుంగభద్ర నది తీరంలో పుణ్య హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీ మఠం అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సై శివాంజల్కు సూచించారు.


