News November 4, 2025
మన్నెగూడ – అప్ప జంక్షన్ రోడ్డు ప్రమాదాల హాట్స్పాట్!

మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు రోడ్డు ప్రమాదాలకు హాట్స్పాట్లుగా మారాయి. గత 2014 నుంచి 2025 వరకు జరిగిన గణాంకాల ప్రకారం, ఈ ప్రాంతాల్లో మొత్తం 3,058 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 358 మంది మృతి చెందగా, మరో 2,030 మంది తీవ్రంగా గాయపడ్డారు.“ప్రాణాలు పోయాకే స్పందన ఎందుకు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 4, 2025
160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News November 4, 2025
ఎల్లారెడ్డి: జాతీయ రహదారి పనులకు సహకరించాలి: RDO

ఎల్లారెడ్డి పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులకు సహకరించాలని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఆయన వ్యాపార సముదాయము, దుకాణాలు, ఇళ్ల యజమానులతో సమావేశమై మాట్లాడారు. జాతీయ రహదారి పనులకు ఆటంకం కలిగించొద్దన్నారు. దుకాణ యజమానులు అక్రమ కట్టడాలను తొలగించుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు ప్రజా హితం కోసమే జరుగుతున్నాయన్నారు.
News November 4, 2025
అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్ను క్లిక్ చేసి లేదా QR కోడ్ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.


