News April 11, 2024

పార్వతీపురం: ‘రక్త హీనత పిల్లలపై దృష్టి సారించాలి’

image

రక్త హీనతపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ కార్యక్రమం ( ప్రాజెక్టు ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటి రేట్ బిలో 10)పై వైద్య అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణకు ముఖ్యంగా రక్త హీనత నివారణపై దృష్టి సారించాలన్నారు.

Similar News

News March 19, 2026

సురక్షిత బాల్యానికి ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’: VZM ఎస్పీ

image

విజయనగరంలో పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు గురువారం ఎస్పీ దామోదర్ తెలిపారు. పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద ఘటనలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి వేధింపులు గమనించినా ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ వాట్సాప్ 7993485111కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 19, 2026

VZM: పరీక్షల ముగింపు.. స్టేషన్‌లో కిక్కిరిసిన జనం

image

విజయనగరం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి భారీ రద్దీ కనిపించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ముగియడంతో పాటు ఉగాది పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫారాలు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎక్కువగా కనిపించారు. దీనితో రైల్వే సిబ్బంది తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

News March 19, 2026

VZM: ‘రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు’

image

రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా తన కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 22-A సవరణలు, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు.