News November 5, 2025
గూడెం: ఆలయంలో కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు పూర్తి

దండేపల్లి మండలంలోని పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
Similar News
News November 5, 2025
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే గుర్తింపు రద్దు

AP: కోర్సులు పూర్తైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ కాలేజ్, ప్రైవేటు వర్సిటీ గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తామని ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.15 లక్షలు జరిమానా విధిస్తామంది. ప్రైవేటు కాలేజీలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అదనంగా వసూలు చేసిన ఫీజులను కూడా తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఫ్యాకల్టీ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని తెలిపింది.
News November 5, 2025
నేడు ఐనవోలు దేవుడి గుట్టపై అపూర్వ ఘట్టం..!

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి కొలువై ఉన్న హనుమకొండ జిల్లా ఐనవోలులో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నేడు అపూర్వ ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఏటా గ్రామంలోని చెరువు సమీపంలో ఉండే దేవుడి గుట్టపై అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. 50 కేజీల కర్పూరం, 60 కేజీల వత్తులు, 50 కేజీల నూనెను దీనికి వాడనున్నారు. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఈ ఘట్టాన్ని ఊరంతా తిలకించనుంది.
News November 5, 2025
పంచగ్రామాల సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

సింహాచలం పరిధిలోని అడవివరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం&చీమలాపల్లి పరిధిలో సుమారు 12 వేల వరకు ఇళ్లు ఉన్నాయి. సింహాచలం దేవస్థానం, ఆయా గ్రామాలకు యాజమాన్య హక్కులు ఉన్నా క్రమబద్ధీకరణ అవ్వలేదు. దీంతో నివాసితులు తమ ఇళ్లను అమ్మడం, కొత్తవారు కొనడం లేదా మరమ్మతు చేయడం కష్టతరంగా మారింది. దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను రద్దు చేసి తమకు <<18202286>>న్యాయం చేయాలని<<>> ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


