News November 5, 2025
ఏలూరు: మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఏలూరులోని మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) విద్యార్థులకు టీఈటీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇన్ఛార్జి కార్యనిర్వాహక సంచాలకులు ప్రభాకరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News March 25, 2026
రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.
News March 25, 2026
హుజూర్నగర్, కోదాడపై డీలిమిటేషన్ ఎఫెక్ట్!

రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పబ్లిక్ టాక్. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలపడం లేదా కొత్తవి చేర్చడం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గాల విభజన జరిగితే ఆ ప్రభావం నేరుగా HNR, KDDలపై పడనుంది.
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.


