News November 5, 2025
కాకినాడ: మూడు రోజుల్లో వస్తా అన్నారు.. ఇంకా రాలేదే..!

గత నెల 9న ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మూడు రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చి, కాకినాడ నుంచి కోనపాపపేట వరకు బోటులో పర్యటించి కాలుష్య జలాలను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పర్యటనకు రాకపోవడంతో యూ.కొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “డిప్యూటీ సీఎం గారు రండి, ఒక్కసారి కాలుష్యం చూడండి” అని వారు కోరుతున్నారు.
Similar News
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News November 5, 2025
ADB: పిల్లర్ పడి బాలుడి దుర్మరణం

ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు పిల్లర్ పడి దుర్మరణం చెందిన విషాద ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంద్ర నగర్కు చెందిన దౌరే వీర్(7) బుధవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా పిల్లర్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
News November 5, 2025
సంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే.! (UPDATE)

కర్ణాటక రాష్ట్రం హాలికెడ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన <<18203736>>నలుగురు వ్యక్తులు మృతి <<>>చెందారు. గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు నాగరాజు (35), నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60)తో ప్రతాప్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


