News November 5, 2025

2,400 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ : UTF

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని UTF జిల్లా కార్యదర్శి కౌలన్న, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, మండల అధ్యక్షుడు పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కోసిగిలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని కేటగిరీలు కలుపుకొని సుమారుగా 2,400 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 9, 2026

ఇరాన్‌పై దాడులు.. ఆ ఒక్క దీవిని US టచ్ చేయట్లేదు!

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భీకర దాడులకు పాల్పడుతున్నా ఆ దేశంలోని ఖర్గ్ దీవిని మాత్రం టచ్ చేయట్లేదు. ఇరాన్‌ తీరానికి 25KM దూరంలో ఉన్న దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఒక్కరోజే ఇక్కడ 7M బ్యారెళ్ల చమురును భద్రపరచొచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90%. దీని మీద దాడి చేస్తే ఇరాన్‌కే కాకుండా గల్ఫ్ మొత్తానికి భారీ నష్టం వాటిల్లుతుంది. చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరుగుతాయి.

News March 9, 2026

కొత్త బురుజులో సీఎం చంద్రబాబు ప్రజా సభ

image

డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తొలుత రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

News March 9, 2026

విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

image

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.