News November 5, 2025

జనగామ: సీసీఐ కొర్రీలు.. దళారుల దండు!

image

జిల్లాలో క్వింటాకు ₹8,100 మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించినా, రైతులకు కొర్రీలు ఎదురవుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని పత్తి తెస్తే.. కాయలు, తేమ ఎక్కువ ఉన్నాయని తిరస్కరిస్తున్నారు. దీంతో చేసేది లేక పురుగులు, వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు, దళారుల పాలు అవుతున్నారు. వారు ₹5,000కే ప్రైవేటుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News November 5, 2025

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

JGTL(D)లో చలి తీవ్రత కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో మన్నెగూడెంలో 20℃, గోవిందారం 20.2, పూడూర్, గొల్లపల్లి 20.3, కథలాపూర్ 20.5, తిరమలాపూర్, పెగడపల్లె 20.6, నేరెళ్ల, మడ్డుట్ల, మల్యాల 20.7, మల్లాపూర్, రాఘవపేట 20.8, జగ్గసాగర్ 21.1, పొలాస, సారంగాపూర్, ఐలాపూర్ 21.2, జగిత్యాల, రాయికల్ 21.4, కోరుట్ల, గోదూరు, బుద్దేశ్‌పల్లి, కొల్వాయి 21.5, మేడిపల్లి 21.6, అల్లీపూర్లో 21.9℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News November 5, 2025

SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గింది. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 28,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటినిల్వ 80.5 టీఎంసీలు, నీటిమట్టం 332.54 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.

News November 5, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: BJP కోసం పవన్‌?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరపడింది. ప్రచారానికి కేవలం 4 రోజులు సమయం ఉంది. చివరి ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అందుకే అభ్యర్థులు, పార్టీల అగ్ర నాయకులు ప్రచారం జోరుగా చేస్తున్నారు. BJP తరఫున ప్రచారం చేయనున్నారని జనసేన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ తెలిపారు. TBJP నేతలతో సమావేశమైన ఆయన ఈ విషయం తెలిపారు. APలో BJP, జనసేన, TDP కూటమిగా ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో పవన్ ప్రచారం చేయనున్నారు.