News November 5, 2025
NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.
Similar News
News March 5, 2026
NLG: ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీల్లో అల్పాహారం!

అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అల్పాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అనుముల, చింతపల్లి, దామరచర్ల, కొండమల్లేపల్లి, DVK, MNGD, MLG, NKL, NLG ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకం అమలు కానుంది. జిల్లాలోని మొత్తం 2,093 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రానుంది.
News March 5, 2026
NLG: మూడు నెలల బియ్యం.. ఇక ఒకేసారి!

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్కు నెలకు 6 కిలోల చొప్పున, 3 నెలలకు కలిపి 18 కిలోలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 5.38 లక్షల మంది కార్డుదారులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. 1051 రేషన్ షాపులకు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించాలని ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
News March 5, 2026
దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న కలెక్టరేట్లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ విన్నపాలను అందజేయవచ్చని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.


