News November 5, 2025

NLG: ఎట్టకేలకు రేషన్ సంచుల పంపిణీ!

image

రేషన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు రేషన్ సంచులు పంపిణీ చేయనున్నారు. గత నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంచులను ఐఎంజీ గోదాములకు సరఫరా చేసింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉండడంతో సంచులను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఎంజీ స్టాక్ పాయింట్ల నుంచి ఆయా రేషన్ షాపులకు సంచులు చేరాయి.

Similar News

News March 24, 2026

చిత్తూరు DMHOగా నాగ శశిభూషణ్ రెడ్డి

image

చిత్తూరు డీఎంహెచ్ఓగా నాగ శశిభూషణ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇది వరకు అనంతపురం జిల్లా డీఐవోగా పని చేశారు. ఈ జీవోలో ప్రస్తుత డీఎంహెచ్ఓ సుధారాణిని ఎక్కడకు బదిలీ చేశారు పేర్కొనలేదు.

News March 24, 2026

మిర్యాలగూడ: తండ్రి ముందే కొడుకు మృతి

image

జ్వరంతో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్న చరణ్ అనే బాలుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. దామరచర్ల మండలం బెట్టెతండాకు చెందిన బాలుడు తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, మిర్యాలగూడ హైవే అగ్రిగోల్డ్ కాలనీ వద్ద ధాన్యం ట్రాక్టర్ ఇంజిన్ తగిలింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడగా, బాలుడిపై నుంచి టైరు వెళ్లడంతో మృతి చెందాడు. కళ్లముందే కొడుకు ప్రాణాలు పోవడంతో తండ్రి రోదనలు మిన్నంటాయి.

News March 24, 2026

తగ్గిన అమెరికా వీసాలు.. భారత్, చైనాపైనే ప్రభావం

image

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన రూల్స్ వల్ల అమెరికా వీసాల జారీ భారీగా తగ్గింది. భారత్, చైనా పౌరులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతేడాది కేవలం 2.5 లక్షల వీసాలే జారీ చేయగా శాశ్వత, తాత్కాలిక నివాస వీసాల్లో 11% తగ్గించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు సంబంధించి 84 వేల వీసాలు తగ్గడంతో అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.