News November 5, 2025

సిరిసిల్ల: ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌

image

ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షురాలు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ పుష్పలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో స్పెషల్ లోక్ అదాలత్‌పై ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు.

Similar News

News November 5, 2025

Whatsappలో అదిరిపోయే ఫీచర్

image

వాట్సాప్‌లో త్వరలో ‘యూజర్‌నేమ్ ఆధారిత కాలింగ్’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో యూజర్లు తమ ఫోన్ నంబర్ ఇవ్వకుండా యూజర్‌నేమ్‌ ద్వారా ఇతరులకు వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయొచ్చు. యూజర్లు ప్రైవసీ కోసం ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకు ఇక వ్యక్తిగత నంబర్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ వాట్సాప్ కనెక్టివిటీని సులభతరం చేయనుంది.

News November 5, 2025

కామారెడ్డి: జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లో అర్థశాస్త్ర విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు అర్చన, కావేరి, వందన, ముస్కాన్, భవిత, సృజన రాణించారు. మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం- జిల్లాలో ప్రభావం అనే అంశంపై రాష్ట్రస్థాయిలో బుధవారం ఉత్తమ బహుమతి అందుకున్నారు.

News November 5, 2025

మణుగూరులో 144 సెక్షన్.. ఇతర ప్రాంతాల్లో నిరసనకు పిలుపు

image

మణుగూరులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఈనెల 7న తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని ఇతర నియోజకవర్గాల్లో చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. పినపాక మినహా 4 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని సూచించారు. పినపాక నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు ఎక్కడి వారు అక్కడే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.