News November 5, 2025

NGKL: భక్తి జ్వాలలో ప్రకాశిస్తున్న కార్తీక పౌర్ణమి

image

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కాగా, ఈరోజు పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.

Similar News

News March 14, 2026

MHBD: టెన్త్ పరీక్షలకు 8,157 మంది విద్యార్థులు

image

జిల్లాలో నేటి నుంచి మొదలుకానున్న టెన్త్ పరీక్షలకు మొత్తం 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 4,001 మంది బాలికలు, 4,156 మంది బాలురు మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 435 మంది ఇన్విజిలేటర్లు, 45 చీఫ్ సూపరింటెండెట్లు, 45 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు.

News March 14, 2026

NTR: జాబ్ కోసం సెర్చ్.. భారీ మోసం

image

OLXలో ఉద్యోగం కోసం వెతికిన షేక్ అర్షద్ అనే యువకుడు మోసగాళ్ల చేతిలో చిక్కాడు. ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ప్రసాద్ అనే వ్యక్తి, అర్షద్ వద్ద రూ.3 లక్షలు వసూలు చేసి నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News March 14, 2026

VZM: సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం.. మోసపోతే ప్రశ్నించండి

image

వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.