News November 5, 2025

శ్రీరాంపూర్: సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

image

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని ఎస్టీపీపీ డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్‌ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పోరేట్‌కు బదిలీ చేశారు.

Similar News

News November 5, 2025

ఈనెల 7న మెగా జాబ్ మేళా

image

AP: విజయనగరం జిల్లాలోని AGL డిగ్రీ కాలేజీలో AP స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, PG ఉత్తీర్ణులైన, 18- 35ఏళ్ల మధ్య వయసుగలవారు హాజరు కావొచ్చు. ముందుగా naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జాబ్ మేళాలో 12 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనున్నాయి.

News November 5, 2025

ఆరుట్ల బుగ్గ జాతరకు బస్ రూట్లు ఇవే..!

image

దక్షిణ కాశీగా పిలువబడే ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరుడి జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హజరై మొక్కులు తీర్చుకుంటారు. బుగ్గ జాతరకు రావడానికి HYD నుంచి ఇబ్రహీంపట్నం, యాచారం- మాల్ ప్రాంతాల నుంచి గున్‌గల్, రంగాపూర్-జాపాల మీదుగా చేరుకోవచ్చు. చౌటుప్పల్, రాచకొండ మీదుగా జాతరకు వెళ్లొచ్చు. ఇబ్రహీంపట్నం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

News November 5, 2025

ప్రపంచకప్ గుర్తుండిపోవాలని..

image

భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయం గుర్తుండిపోవాలని చేయిపై వరల్డ్ కప్ టాటూను వేయించుకున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన చర్మంతోపాటు హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ‘తొలి రోజు నుంచే నీ కోసం ఎదురుచూశా. ఇకపై ప్రతి రోజూ నిన్ను చూసుకుంటా. కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు.