News November 5, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టులో 11, 929 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

కామారెడ్డి-నిజామాబాద్ జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ ఖరీఫ్‌లో 70 రోజులు దాటినా వరద కొనసాగుతోంది. మంగళవారం 11,929 క్యూసెక్కుల వరద రాగా, 2 గేట్లు ఎత్తి 8,096 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,404.99 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు.

Similar News

News November 5, 2025

రబీలో రాగులు(రాగి) సాగు – అనువైన రకాలు

image

రబీలో రాగి పంటను నవంబర్-డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు.తేలిక రకం ఇసుక నేలలు, బరువు నేలల్లో విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కాదు. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య, వకుళ, హిమ, తిరుమల, వేగవతి, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి వంటి రకాలు ఖరీఫ్, రబీకి అనువైన రాగి పంట రకాలు. ఎకరాకు నారుకోసం 2.5 కిలోల విత్తనం, వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం.

News November 5, 2025

ఈనెల 7న మెగా జాబ్ మేళా

image

AP: విజయనగరం జిల్లాలోని AGL డిగ్రీ కాలేజీలో AP స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, PG ఉత్తీర్ణులైన, 18- 35ఏళ్ల మధ్య వయసుగలవారు హాజరు కావొచ్చు. ముందుగా naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జాబ్ మేళాలో 12 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనున్నాయి.

News November 5, 2025

ఆరుట్ల బుగ్గ జాతరకు బస్ రూట్లు ఇవే..!

image

దక్షిణ కాశీగా పిలువబడే ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరుడి జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హజరై మొక్కులు తీర్చుకుంటారు. బుగ్గ జాతరకు రావడానికి HYD నుంచి ఇబ్రహీంపట్నం, యాచారం- మాల్ ప్రాంతాల నుంచి గున్‌గల్, రంగాపూర్-జాపాల మీదుగా చేరుకోవచ్చు. చౌటుప్పల్, రాచకొండ మీదుగా జాతరకు వెళ్లొచ్చు. ఇబ్రహీంపట్నం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.