News November 5, 2025

భద్రాచలం గోదావరి వద్ద కార్తీక శోభ

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నది తీరంలో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదిలో వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో దేవాలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

Similar News

News November 5, 2025

FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

image

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News November 5, 2025

HYD: పులులను లెక్కించాలని ఉందా.. మీ కోసమే!

image

దేశంలో పులుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుందా? అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే. వచ్చే ఏడాది జనవరిలో(17- 23 వరకు) ప్రభుత్వం పులుల గణన చేపట్టనుంది. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అయితే రోజుకు 10- 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంతేకాక మీ వయసు 18- 60 ఏళ్లలోపు ఉండాలి. ఈ నెల 22లోపు అప్లై చేసుకోవాలి. వివరాలకు 040-23231440 నంబరుకు ఫోన్ చేయండి.

News November 5, 2025

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అస్వస్థత

image

అమలాపురం: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అమలాపురం ఇన్‌ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రికి వచ్చారు. పలువురు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి చేరుకుంటున్నాయి.