News November 5, 2025

GNT: తలచుకుంటే తల్లడిల్లే బీభత్సం..!

image

నేడు ప్రపంచ సునామీ దినోత్సవం. అయితే 2004 డిసెంబర్ 26న బంగాళాఖాతంలో వచ్చిన సునామీ ఆంధ్ర తీరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీర గ్రామాలు అతలాకుతమయ్యాయి. ఈ సునామీ వల్ల మొత్తం 301 గ్రామాలు నష్టపోగా, 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహాయ చర్యలు నెలల పాటు కొనసాగాయి.

Similar News

News March 7, 2026

ఖాకీ కొలువుల కోసం DSNRలో భారీ ర్యాలీ!

image

పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనం నశించింది. 20వేల పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దిల్​సుఖ్​నగర్​లో భారీ ర్యాలీకి పోలీస్ నిరుద్యోగ JAC పిలుపునిచ్చింది. వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలని, జీవో46ను రద్దు చేయాలని శనివారం పోస్టర్ రిలీజ్ చేశారు. లాంగ్ జంప్ 3.8Mకు తగ్గించాలని కోరారు. సర్కారు కాలయాపన చేస్తే ఆక్రోశం తప్పదని ఆకాశ్, శంకర్ బృందం హెచ్చరించింది.

News March 7, 2026

AIతో భారీగా ఉద్యోగాలేమీ పోలేదు: ఆంథ్రోపిక్ రిపోర్ట్

image

ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోలేదని ఆంథ్రోపిక్ వెల్లడించింది. టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే జాబ్స్‌లో యువ ఉద్యోగుల నియామకాలు తగ్గాయని ఓ నివేదికలో తెలిపింది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలసిస్, రొటీన్ డిజిటల్ డ్యూటీలను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువని చెప్పుకొచ్చింది. మెకానిక్‌లు, వంటవాళ్లు.. ఇలా మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు సమస్య లేదని పేర్కొంది.

News March 7, 2026

ఆర్టీసీ ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలు: ఆర్ఎం

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు వరంగల్ RM విజయభాను తెలిపారు. హనుమకొండ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.