News November 5, 2025

NTR: తలచుకుంటే తల్లడిల్లే బీభత్సం..!

image

నేడు ప్రపంచ సునామీ దినోత్సవం. అయితే 2004 డిసెంబర్ 26న బంగాళాఖాతంలో వచ్చిన సునామీ ఆంధ్ర తీరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీర గ్రామాలు అతలాకుతమయ్యాయి. ఈ సునామీ వల్ల మొత్తం 301 గ్రామాలు నష్టపోగా, 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహాయ చర్యలు నెలల పాటు కొనసాగాయి.

Similar News

News March 20, 2026

నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

News March 20, 2026

SVU: రేపటి డిగ్రీ పరీక్ష వాయిదా

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(UG) ఇయర్ ప్యాటర్న్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు పరీక్ష విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ జరగనుందన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News March 20, 2026

నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

image

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.