News November 5, 2025
మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.
Similar News
News March 15, 2026
నెల్లూరు: మహిళా కండక్టర్కు HIV ఉందంటూ అవమానం!

నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరిలో అవమానించి, HIV ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి వైద్యురాలిని మందలించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ల్యాబ్లో రక్త పరీక్షలు చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని బాధితురాలు తెలిపారు.
News March 15, 2026
జనగణనకు 76వేల మంది టీచర్లు

TG: మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలిదశ <<19385989>>జనగణనకు<<>> 76వేల మంది టీచర్లను వినియోగించుకుంటామని సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్పారు. పనితీరును పరిశీలించేందుకు ప్రతి 6-7 మంది ఎన్యూమరేటర్లకు ఓ సూపర్ వైజర్, రాష్ట్రవ్యాప్తంగా 762 మంది ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. పౌరులే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు APR 26-మే 10 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్/యాప్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
News March 15, 2026
ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.


