News November 5, 2025
GNT: ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా సీసీఐకి విక్రయించాలి

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
Similar News
News March 21, 2026
GNT: PACS ఉద్యోగులకు డిగ్రీ నిబంధనపై అసంతృప్తి

PACS సిబ్బందికి ప్రమోషన్ల కోసం డిగ్రీ అర్హత తప్పనిసరి చేయడం వివాదంగా మారింది. ఉమ్మడి GNT జిల్లాలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20ఏళ్లకు పైగా సేవ చేస్తున్న వారిని ఇప్పుడు చదువు పూర్తి చేయాలని కోరడం కష్టమని అంటున్నారు. 2020లో రూపొందించిన HR పాలసీ అమలు కాకపోయినా కొత్త నిబంధనలు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగులు మరికొంత గడువు ఇవ్వాలంటున్నారు.
News March 21, 2026
సామాన్యుడిలా తిరుమల దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు

సీఎం హోదాలో ఉన్న ప్రొటోకాల్ పక్కనపెట్టి సామాన్యుడిలా క్యూ కాంప్లెక్స్ వెళ్లి చంద్రబాబు కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శనం చేసుకుంది. శనివారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ మార్గంలో వెళ్తూ టీటీడీ ఏర్పాట్లు, భక్తుల ఇబ్బందులు చంద్రబాబు పరిశీలించి స్వయంగా తెలుసుకున్నారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని టీటీడీ అధికారులకు సూచించారు.
News March 21, 2026
గుంటూరు: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ, యోగా టీచర్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు మార్చి 23 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు guntur.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.


