News November 5, 2025
ఏపీలో అగ్రస్థానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

క్యూఎస్ ఏషియా సంస్థ విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సర ర్యాంకింగ్స్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 761-770 ర్యాంక్ సాధించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ 801-850 ర్యాంకుల్లో, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ 851-900 ర్యాంక్లో, శ్రీకృష్ణ యూనివర్సిటీ 1001-1100 ర్యాంక్లో నిలిచాయి. ఈ విజయంపై రిజిస్ట్రార్ సింహాచలం అభినందించారు.
Similar News
News March 5, 2026
సంగారెడ్డి: యువతి MISSING.. కేసు నమోదు

పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన యువతి (19) సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 5, 2026
సూర్యాపేట: నిమ్మ తోటలకు తెగుళ్లు.. ఆందోళనలో రైతులు

సూర్యాపేట జిల్లాలో నిమ్మ తోటలకు వేరుకుళ్లు, తామర పురుగు, గజ్జి తెగుళ్లు ఆశించాయి. ఆకులు, కాయలు రాలిపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి. జిల్లాలో 8,200 ఎకరాల్లో నిమ్మ సాగు ఉండగా, ఒక్క నడిగూడెం మండలంలోనే 2,500 ఎకరాలు ఉన్నాయి. తెగుళ్ల నివారణపై మార్గదర్శకాలు లేక, అటు దిగుబడి.. ఇటు ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News March 5, 2026
POLYCET: ఉమ్మడి వరంగల్లో 1,620 సీట్లు!

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిసెట్-2026’ దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,620 సీట్ల భర్తీకి ఏప్రిల్ 20 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. మే 13న పరీక్ష జరగనుండగా, పదో తరగతి విద్యార్థులు ఎస్బీటీఈటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.


