News November 5, 2025
యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.
Similar News
News March 14, 2026
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ విడుదలైనట్లు KU అధికారులు పేర్కొన్నారు. KU పరిధిలోని ఉమ్మడి. ఆదిలాబాద్ జిల్లాలో 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు.
News March 14, 2026
సంగారెడ్డి: ఎస్సీలకు 409 యూనిట్లు మంజూరు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంగారెడ్డి జిల్లాలోని షెడ్యూలు కులాల అభ్యర్థులకు 409 యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లబ్ధిదారులకు రూ. 8.21 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎస్సీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యమని, వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.
News March 14, 2026
IPLకు హర్షిత్ రానా దూరం?

ఈ నెల 28 నుంచి జరగనున్న IPL-2026కి టీమ్ఇండియా బౌలర్, KKR పేసర్ హర్షిత్ రానా దూరమైనట్లు నేషనల్ మీడియా పేర్కొంది. టీ20 WCకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో గాయపడిన ఆయన ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. గత రెండు సీజన్లలో KKR తరఫున రానా 34 వికెట్లు తీశారు. ఆయనకు రీప్లేస్మెంట్గా ఆకాశ్ మద్వల్, సిమర్జీత్ సింగ్తో పాటు మరికొంతమంది డొమెస్టిక్ బౌలర్ల పేర్లను KKR పరిశీలిస్తున్నట్లు సమాచారం.


