News November 5, 2025

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

image

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News April 3, 2026

భూ భారతి: రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ నో ఛేంజ్

image

TG: ‘భూ భారతి’లో GOVT కొత్త రూల్ పెడుతోంది. భూ యజమాని ముందు ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్లో భూ సర్వేకు దరఖాస్తు చేస్తే సరిహద్దు రైతులకు సర్వేయర్లు నోటీసులిస్తారు. వారి సమక్షంలో సర్వే చేసి తహసీల్దార్లకు రిపోర్టు ఇస్తారు. రెవెన్యూశాఖ ఇచ్చే సర్వేపటంతో భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు రైతు దరఖాస్తు చేసుకోవాలి. సర్వేలో తేలిన విస్తీర్ణానికే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. తరువాత మార్పునకు అవకాశం ఉండదు.

News April 3, 2026

ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్..!

image

AP: పల్నాడు (D) మాచర్లలో గురువారం ప్రభుత్వ ఉద్యోగిని(32)పై జరిగిన అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లూచేతులు కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు HIV ఉందని బాధితురాలు చెప్పగా.. ఆమెను తీవ్రంగా కొట్టి, ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్ చొప్పించినట్లు సమాచారం. స్థానికులు వెళ్లి చూడగా ఆమె వివస్త్రగా స్పృహ కోల్పోయి పడి ఉంది.

News April 3, 2026

ఇంట్లో కుండలోని నీటిని తాగుతున్నారా?

image

వేసవి తాపాన్ని తీర్చే మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ శుభ్రత పాటించకపోతే అదే అనారోగ్యానికి దారితీయవచ్చు. మట్టి కుండలో నీరు సురక్షితంగా ఉండేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ‘కొత్త కుండను వాడే ముందు రోజంతా నీటిలో నానబెట్టాలి. రోజూ వేడి నీటితో కడగడం వల్ల బాక్టీరియా చేరదు. కుండను కడిగేందుకు సబ్బు వాడకండి. ఉప్పు లేదా బేకింగ్ సోడాతో మాత్రమే రుద్దడం మేలు’ అని సూచిస్తున్నారు.